NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఈయన.. ఆ తర్వాత కొరటాల శివతో ఓ సినిమా, ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. వీటిలో కొరటాల చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇప్పుడు `రాజావారు` బాధతను మీదేసుకున్నాడు.
అసలు కథేంటంటే.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు, నార్ని శ్రీనివాసరావు తనయుడు నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తేజ దర్శకత్వంలో ఇతడి డబ్యూ మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఈ మూవీకి ఆగిపోయిందట. అయితే ఇప్పుడు నితిన్ చంద్రను పరిచయం చేసేందుకు సతీష్ వేగేశ్న బరిలోకి దిగాడు.
ఈయన దర్శకత్వంలో నితిన్ చంద్ర హీరోగా ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ జరుపుకుంటోందట. `శ్రీ శ్రీ రాజావారు` అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మలయాళంలో టోవినో థామస్ నటించిన సూపర్ హిట్ మూవీ `తీవండి`కి రీమేక్గా ఇది రూపుదిద్దుకుంటోందట. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం.
అయితే బావమరిది కోసం ఈ సినిమా బాధ్యతలన్నీ ఎన్టీఆర్ దగ్గరుండి మరీ చూసుకోబోతున్నాట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.