Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇటీవల తారక్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది.. నెగిటివ్ వచ్చింది అని చెప్పడానికి సంతోషంగా ఉంది అని ట్విట్టర్ వేదికగా తారక్ తెలియజేశారు.
కోవిడ్ ను సీరియస్ గానే తీసుకోవాలి అయితే మంచి జాగ్రత్తలు తీసుకుంటూ.. పాజిటివ్ మైండ్ తో ఉంటే దీన్ని సులభంగా జయించవచ్చు. మీలోని శక్తి మీకు పెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి, భయపడకండి.. కిమ్స్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి , మా కజిన్ డాక్టర్ వీరు, టెనెట్ డయాగ్నస్టిక్స్ అందరికీ ధన్యవాదాలు.. వీళ్ళంతా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.. నేను కోలుకోవాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. అంటూ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్..