Jr NTR Posani Krishna Murali : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతోంది. రాష్ట్ర రాజకీయాలపై తాజాగా వైసీపీ నేత, సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని మురళి కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రమే తనకు కావాల్సిన వారిని ఆకాశానికెత్తారని, అవసరం తీరిపోయాక వారిని వదిలించుకోవడం చంద్రబాబుకు అలవాటేనని పోసాని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు తీరు ఇదే విధంగా ఉందని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం ఎంతో కష్టపడ్డాడు. చంద్రబాబు అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ స్టేజ్ పై ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ కన్నా ముందుగా ఆ కుర్చీలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని పోసాని తెలిపారు.
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తిన చంద్రబాబు తరువాత లోకేష్ విషయంలో …లోకేష్ నువ్వు ఇంకెంత సంపాదించుకుంటావయ్యా.. పైనున్న మీ తాత కూడా సంతోషంగా లేడు నిన్ను చూసి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును పొగిడిన వారు మంచివారు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై తప్పులు ఎత్తి చూపిస్తారని, అచ్చం పవన్ కళ్యాణ్ విషయంలో మాదిరిగానే ఎన్టీఆర్, హరికృష్ణ విషయంలో కూడా జరిగిందని పోసాని తెలియజేశారు…
చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా చూసేవారు:
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో గా ఉన్నారు.ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుకున్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేకుండా అతని బలవంతంగా ఒప్పించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేశారు. ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉండడంతో తనకు రాజకీయపరంగా లాభం ఉంటుందని భావించారు. అయితే ఎన్టీఆర్ హీరో కాకముందు వీళ్ళెవరు అతనితో మాట్లాడేవారు కాదని, ఎన్టీఆర్ ను చంద్రబాబుతో సహా అందరూ ఓ అనాధల చూసేవారిని పోసాని మీడియా ఎదుట చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలపై టిడిపి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.