అఖిల్ అక్కినేని మూడు సినిమాలు `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` సినిమాలతో సందడి చేసినా.. విజయం మాత్రం అఖిల్తో దోబూచులాడుతూనే ఉంది. ఎలాగైనా మంచి హిట్ కొట్టి హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు గీతాఆర్ట్స్లో సినిమా చేయబోతున్నాడు. `బొమ్మరిల్లు` భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ సొగసరి కియరా అద్వాని హీరోయిన్గా నటించనుంది. భరత్ అనే నేను, వినయవిధేయరామ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న ఈ బ్యూటీ అఖిల్ సినిమాకు ప్లస్ అవుతుందనే నిర్మాతలు భావిస్తున్నారు. సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కియరా మరో టాలీవుడ్ చిత్రంలో తళుక్కుమంటుంది.
previous post