Acharya : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసినదే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఎప్పుడు ఎంతో చురుకుగా ఉండే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా తన అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తుంటారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని ఆచార్య సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది? అని అడగగా అందుకు కాజల్ సమాధానం చెబుతూ..”ఆచార్య సినిమాలో ఈ పాత్రలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్రల్లో నటించి చాలా కాలం అయ్యింది. ఇక లాక్ డౌన్ సమయంలో ఈ పాత్రల పై మరింత ఇష్టం పెరిగింది”.అని కాజల్ అగర్వాల్ తెలియజేశారు. ఈ చిత్రం గురించి మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కాజల్ కన్నా ముందు త్రిషను సంప్రదించారు.అయితే ఈ పాత్రలో చేయడానికి త్రిష తిరస్కరించడంతో ఆ అదృష్టం కాజల్ ను వరించిందని చెప్పవచ్చు.
ఆచార్య సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు నలభై నిముషాల పాటు రామ్ చరణ్ మనకు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ సినిమా ద్వారా తండ్రి కొడుకులను ఇద్దరినీ ఒకే తెరపై చూడవచ్చని మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తొందరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.