అగ్రకథానాయిక కాజల్ అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానంతరం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళొచ్చారు. వీటికి సంబంధించిన ఫోటోలను కాజల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ప్రపంచంలోని మొట్టమొదటి నీటి అడుగున ఉన్నది మురాకా హోటల్లో బస చేశారు. ఈ హోటల్లో ఒక్కరాత్రికి దాదాపు రూ.38 లక్షలు అవుతుండగా.. అలా 10 రోజులకి దాదాపు 5 కోట్లు ఖర్చుచేస్తున్నారు. దీని కోసం 5 కోట్లు ఖర్చు పెట్టిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంత బాగానే ఉంది కానీ దీని కోసం కాజల్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంట. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా సమాచారం ప్రకారం మాల్దీవుల ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కాజల్ కి ఖర్చు చేయలేదని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఏ సెలెబ్రిటీకైతే ఇన్స్టాగ్రామ్లో రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటారో వాళ్లు మాల్దీవులకు వచ్చినపుడు ఏ హోటల్లో బస చేస్తే అక్కడ ఫైవ్ స్టార్ భోజనాన్ని ఉచితంగా అందిస్తారంట. 5 మిలియన్స్ కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉంటే ఉండటానికి హోటల్ రూమ్, భోజనం, ఇద్దరికి రిటర్న్ టికెట్స్ ఫ్రీగా ఇస్తారట.
ఇన్స్టాగ్రామ్లో కాజల్ కి దాదాపు 16 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున ఉన్న ది మురాకా హోటల్ యాజమాన్యమే ఫోన్ చేసిదంట. కేవలం దుస్తులు, ఇతర బ్యూటీ సామాగ్రి మాత్రమే వెంట తెచ్చుకోమని చెప్పిందట.
టూర్ ఫొటోల్ని సోషల్మీడియా వేదికగా ఫ్యాన్స్తో పంచుకోమని తెలియజేసిందట. దాంతో కాజల్ తన హలీడే ఫొటోల్ని షేర్ చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.