వెండి తెర.. ఇదో అద్బుతం.. ఎంతో మందికి జీవితాన్నిస్తుంటుంది. సరికొత్త ప్రపంచాన్ని ప్రపంచానికి చూపెడుతూనే ఉంటుంది. ఎంతో మంది కథానాయకులను, నాయికలను పరిచయం చేస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి చూపుడుతూ ఉంటుంది. కాని వెండితెర మీదికి మనలాగే మనం రాగలమా అంటే మాత్రం కాదనే చెప్పుకోవచ్చు. ముఖానికి బోలేడు మేకప్ లేనిదే తెరపైకి వెళ్లే సాహసం మాత్రం చేయలేకపోతుంటారు.. మన స్టార్స్. తెరపై కనిపించాలంటే మాత్రం దగదగా మెరిసిపోయే రంగుల ప్రపంచాన్ని చుట్టుకోవాల్సిందే..
వారి మేకప్ కాస్టూమ్స్ తో అందచందాలను ఒలకబోస్తూ అభిమానులను సంపాధించుకోకతప్పదు. ఒక రకంగా చెప్పాలంటే మేకప్ లేనిదే తరపైకి రాలేరేమో అనిపిస్తుంటుంది వారిని చూస్తుంటే. కాని కొందరు కథానాయికలు మాత్రం తెరపైకి వారి ఒరిజినల్ ముఖాలనే చూపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు. ఆ జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయిపల్లవి. ఇదిలా ఉంటే చందమామ కాజల్ అగర్వాల్ కూడా వితౌట్ మేకప్ తో ఒకసారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దానితో పాటుగా ఒక సందేశాన్ని కూడా పెట్టారు. దానితో ఆమె అభిమానులు మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాహ్యంగా మేకప్ వేసుకున్నంత మాత్రానా మన ఉనికిని మారుస్తుందా అని పోస్ట్ చేసి ఆమె తన భావాలను వ్యక్త పరిచారు. అగ్రకథానాయికలలో ఒకరిగా నిలిచిన ఈ మిత్రవింద తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు. వరుస సినిమాలతో దూసుకెలుతున్న సందర్భంలో మేకప్ లేకుండా దిగిన ఫోటోలను షేర్ చేసి తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకున్నారు.
కాగా ఈ ముద్దుగుమ్మ గత నెల ఓ ఇంటి కోడలైన విషయం అందరికీ తెలిసిందే. వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూని వివాహమాడింది ఈ భామ. వారిరువురు కొత్త జీవితానికి స్వాగతం పలికారు. కాగా పెళ్లి తర్వాత గౌతమ్ కిచ్లూకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా భాగా పెరిగింది. ఈ సందర్భంగా కిచ్లూ తన భార్య కాజల్ అగర్వాల్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా కిచ్లూ మాట్లాడుతూ.. మార్నింగ్ టైమ్ లో కాజల్ ఎలా ఉందో చూడంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో మిసెస్ కిచ్లూ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంది.