నటిగా వరుస అవకాశాలతో దశాబ్దంపైగా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ నిర్మాతగా మారడానికి నిర్ణయించుకుంది. అయితే ఆదిలోనే ఆమె ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. వివరాల్లోకెళ్తే.. కాజల్ అగర్వాల్కు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఉమెన్ ఓరియెంటెడ్ స్టోరీ చెప్పాడట. ఆమెకు బాగా నచ్చడంతో సినిమా చేయాలనుకుంది. నటిస్తూ ఆ సినిమాను నిర్మించడానికి సిద్ధమైందట. పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్తో రమ్మని కాజల్ చెప్పగా, ఇంత వరకు ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ రెడీ చేయలేదట. దీంతో కాజల్ తన ప్రయత్నాలను మానుకుందట. ప్రస్తుతం ఈమె ఇండియన్ 2న నటిస్తుంది. ఇకపై నటనపైనే ఫోకస్ పెట్టాలని కాజల్ భావిస్తుందట.
previous post
next post