`హలో` చిత్రంతో హీరోయిన్గా కెరీర్ను ప్రారంభించింది కల్యాణి ప్రియదర్శన్. అయితే ఈ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. రెండో సినిమాగా కల్యాణి నటించిన చిత్రం `చిత్రలహరి`. ఇందులో ఇద్దరి హీరోయిన్స్లో మెయిన్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం కల్యాణికి నటిగా మంచి పేరుని తెచ్చిపెట్టింది. `చిత్రలహరి`తో పాటు శర్వానంద్, సుధీర్ వర్మ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్లో ఓ హీరోయిన్గా నటించింది కల్యాణి. ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం కల్యాణి ప్రియదర్శన్కు మరో అవకాశం దక్కింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించబోయే చిత్రం `భీష్మ`లో కల్యాణి రెండో హీరోయిన్గా ఎంపికైందట. ఈ సినిమాలో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది. తర్వలోనే `భీష్మ` సెట్స్కు వెళ్లనుంది. ఇప్పుడిప్పుడే సక్సెస్ రుచి చూస్తున్న కల్యాణి ప్రియదర్శన్కు రాబోయే అవకాశాలు మంచి ఇమేజ్ను తెచ్చి పెట్టాలని ఆశిద్దాం.
previous post
next post