Major: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం వచ్చాక నటీనటుల మధ్య ఇండస్ట్రీ ల మధ్య భారీ ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో సౌత్ సినిమాలు విజయం సాధించడంలో పరిస్థితి ఏమో గాని… సౌత్- నార్త్, ప్రాంతీయ భాష- జాతీయ భాష అనుకుంటూ నటీ నటులు…స్టార్ హీరోలు ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటున్నారు. ఇటీవలే హిందీ భాష గురించి సుదీప్ చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ హీరోలు భారీ ఎత్తున రియాక్ట్ కావడం తెలిసిందే. ఆ తర్వాత “మేజర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో.. బాలీవుడ్ తనని భరించలేదని మహేష్ చేసిన వ్యాఖ్యలు.. పెను దుమారాన్ని రేపాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మేజర్ త్వరలో రిలీజ్ కాబోతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న హీరో అడవి శేష్ చేసిన కామెంట్లు మరింత విమర్శలకు దారి తీసింది. ఈ సినిమా ముంబై తాజ్ హోటల్ దాడులు 26/11 నేపథ్యంలో తీసిన సినిమా కావడంతో… ముంబాయిలో అడవి శేష్ మరియు సినిమా యూనిట్ మీడియా సమావేశం ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా విలేఖరి అడివి శేష్ కి అదిరిపోయే ప్రశ్న వేశారు. మేజర్ తో పాటు కమల్ హాసన్ నటించిన “విక్రమ్” మరియు హిందీలో అక్షయ్ కుమార్ నటించిన “పృథ్వీరాజ్”.. ఒకేసారి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి అని ప్రశ్నించారు. దీనికి అడవి శేష్ సమాధానమిస్తూ… గత రెండు సంవత్సరాలు పాండమిక్ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకోవడం జరిగిందో అందరికీ తెలుసు.
అయితే కమల్ మరియు అక్షయ్ కుమార్ సినిమాలు సముద్రంలో పెద్ద చేపలు వంటివి. ఇక మేజర్ విషయానికొస్తే ఇది గోల్డెన్ ఫిష్ అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. అడివి శేష్ ఇచ్చిన సమాధానానికి.. కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరికొంతమంది నెగిటివ్ గా తీసుకుంటున్నారు. కమల్, అక్షయ్ కుమార్ ప్యాన్స్ కొంతమంది మండిపడుతున్నారు. సీనియర్ హీరోలకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. అడవి శేష్ చేసిన కామెంట్లు సీనియర్ హీరోల సినిమాలను తక్కువ చేసినట్టు ఉందని రియాక్ట్ అవుతున్నారు. మరోపక్క కర్ర విరగకుండా పాము చచ్చిపోయే రీతిలో..బాలీవుడ్ విలేకరికి చాలా తెలివిగా సమాధానం ఇచ్చారని మరి కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. జూన్ 3 వ తారీకు మేజర్ విడుదల కానుంది.