దాదాపు చాలా సంవత్సరాల తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్ “విక్రమ్” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. లోకేష్ కనకగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా తమిళనాడు ఇండస్ట్రీలో “బాహుబలి” రికార్డులను “విక్రమ్” బ్రేక్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇదే సమయంలో ఒకపక్క సినిమా కెరియర్ పరంగా ఇంకా రాజకీయపరంగా అనేక ఓటములు చూసిన కమల్.. తన రేంజ్ కి తగ్గ హిట్టు పడటంతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.
మరో పక్కన నాలుగు సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ సినిమా ధియేటర్ లో విడుదల అవటం తో పాటు ఇండస్ట్రీ హిట్ కావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకున్నారు. యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో తర్కెక్కిన ఈ సినిమా.. కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించడం విశేషం. విక్రమ్ సినిమాతో మంచి జోరు మీద ఉన్న కమల్.. నెక్స్ట్ కేరళ డైరెక్టర్ మహేష్ నారాయణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. ఆ తర్వాత “ఇండియన్ 2” సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. RC15 కంప్లీట్ అయిన వెంటనే శంకర్ “ఇండియన్ 2” బ్యాలెన్స్ కంప్లీట్ చేయనున్నారు.
ఇక ఇదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో “కబాలి” వంటి సినిమా తర్కెక్కించిన డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో కూడా కమల్ హాసన్ సినిమా చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రంజిత్ విక్రమ్ హీరోగా సినిమా చేస్తున్నారు. విక్రమ్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కమలహాసన్ తో రంజిత్ సినిమా చేయనున్నట్లు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్.