Mahesh Kamal: సూపర్ స్టార్ మహేష్ బాబు గత నాలుగు సంవత్సరాల నుండి మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ ప్రాజెక్టు ఒప్పుకున్న బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు పడుతుంది. కరోనా రాకముందు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించగా కరోనా తర్వాత “సర్కారు వారి పాట” తో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం జరిగింది. ఇటీవలే ఈ సినిమా విడుదలయి ఈ ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే మహేష్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులలో రాజమౌళి ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని అందరికీ తెలుసు. మహేష్ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కి దీటుగా విలన్ పాత్ర చాలా కీలకమని మొదటి నుండి టాక్ నడుస్తోంది. అయితే ఈ పాత్రకి సంబంధించి ప్రారంభంలో బాలీవుడ్ హీరోనీ తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేయగా ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. నెగటివ్ పాత్రలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నీ తీసుకోవడానికి రాజమౌళి డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే సినిమాలో విలన్ పాత్ర మెయిన్ కావడంతో దీని దృష్టి పెట్టుకొని కమల్ హాసన్ నీ తీసుకుంటే బాగుంటుందని జక్కన్న డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబంతో యూరప్ ట్రిప్ లో ఉన్నారు. జూన్ మాసంలో తిరిగి ఇండియాకి వచ్చి త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నుండి రాజమౌళి షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!