Kamal Hassan: దక్షిణాది సినిమా రంగంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ఒకపక్క సినిమా రంగంలో మరో పక్క రాజకీయరంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మొన్ననే తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నంత కాలం సినిమాల విషయంలో కొద్దిగా స్పీడ్ తగ్గించిన కమల్ ఇప్పుడు మాత్రం… వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “విక్రమ్” అనే సినిమా చేయటం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సాధించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
డ్రగ్స్ నేపథ్యంలో.. తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహిద్, సూర్య నటించడం జరిగింది. విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన “కేజిఎఫ్ 2” కంటే “విక్రమ్” చాలా అద్భుతంగా తెరకెక్కించారని చూసిన జనాలు చెబుతున్నారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 300 కోట్ల రూపాయలు సాధిస్తాను అని చెబితే అప్పట్లో ఎవరూ నమ్మలేదు.
కానీ “విక్రమ్” సినిమా నిరూపించింది. దీంతో ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తాను. నాకు ఇష్టమైన ఫుడ్ తింటా. కుటుంబం మరియు సన్నిహితులకు చేతనైనంత సాయం చేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని సాయం చేయాలని నాకు ఉండదు. నాకు గొప్ప పేరు వద్దు ఒక మనిషిగా బతకాలి అనుకుంటున్నాను అంటూ ఇటీవల రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొన్న కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ తమిళ సినిమా రంగంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా.. కలెక్షన్ సాధించే దిశగా దూసుకుపోతుంది. రాజకీయంగా ఓటమి ఆ తర్వాత అనేక ఫ్లాపులు రావటంతో..కమల్ సీన్ ఇంకా అయిపోయింది అనుకున్న తరుణంలో విక్రమ్ తో మరోసారి కమల్ తన నటనలో విశ్వరూపం చూపించాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!