Chiranjeevi Kamal: దాదాపు నాలుగు దశాబ్దాల నుండి విలక్షణ నటుడిగా పేరొందిన హీరో కమల్ హాసన్. కానీ గత నాలుగు సంవత్సరాల నుండి పలు కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది. రాజకీయాల్లోకి వెళ్ళటం తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు బుల్లి తెర పై బిగ్ బాస్ రియాల్టీ షోకి హోస్ట్ గా మాత్రమే చేయడం జరిగింది. అయితే కమల్ కటౌట్ వెండితెరపై కనబడి నాలుగు సంవత్సరాలు కావడంతో అభిమానులు చాలా నిరుత్సాహం చెందారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో ఇటీవల లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్.. “విక్రమ్” అనే సినిమా చేయటం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహిద్.. సూర్య వంటి భారీ స్టార్ యాక్టర్స్ ఉండటం… పోటీపడి నటించడంతో మంచి అవుట్ పుట్ రావడం జరిగింది. ఇదిలా ఉంటే “విక్రమ్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాన్ ఇండియా అనే పదం ఎక్కువగా ఫిలిం సర్కిల్స్ లో వినబడుతూ ఉండటంతో కమల్.. మాట్లాడుతూ.. గతంలోనే పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి అని తెలిపారు.
మేము అప్పట్లోనే అనేక పాన్ ఇండియా సినిమాలు చేయడం జరిగిందని అన్నారు. చిరంజీవి కూడా అనేక పాన్ ఇండియా సినిమాలు చేయడం జరిగింది అని స్పష్టం చేశారు. అప్పట్లో తెలుగు హీరోలను తమిళ ప్రేక్షకులు ఆదరించే వారు కాదు అనే టాక్ ఉంది. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని కమల్ తెలిపారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు చిరంజీవి బాగా కనెక్ట్ కావడం.. బాగా పాపులారిటీ రావటంతో తమిళ సినిమాలను ఆయన లైట్ తీసుకున్నారు. వాస్తవానికి చిరంజీవిని తమిళంలో కూడా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చిరంజీవి ఎక్కువగా తెలుగు పై ఫోకస్ పెట్టడం.. అదే మైనస్ పెద్ద తప్పుగా మారింది. లేదంటే వేరే రకంగా ఉండేది అంటూ చిరంజీవిపై కమలహాసన్ వైరల్ కామెంట్స్ చేశారు.