బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, ఆలియా భట్ మధ్య గొడవలు ఇప్పట్లో సమసేలా లేవు. 2019లో ఉత్తమనటిగా ఆలియా భట్, కంగనా రనౌత్ మధ్య పోటీ నెలకొందని ఓ పత్రిక నిర్వహించిన పోల్లో తేలింది. అయితే.. ఈ వ్యవహారం కంగనా, ఆలియా మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఒకరిపై ఒకరు డైరెక్ట్గా.. సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేసుకుంటున్నారు. నేడు కంగనా సోదరి రంగోలి ఆలియా భట్తో పాటు ఆమె కుటుంబంపై కూడా కోపాన్ని వ్యక్తం చేశారు.
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ట్విట్టర్ ద్వారా “డియర్ ఆలియా.. కొందరు మానసిక రోగులు మాట్లాడే మాటలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటున్నందుకు గర్వంగా ఉంది“ అని తెలియజేశారు. అయితే వెంటనే దీనిపై రంగోలి స్పందిస్తూ “ కరణ్ జోహార్ అంటే నీకు చాలా ఇష్టమేమో అందుకే బంధుప్రీతిని చూపిస్తున్నావ్. కరణ్ జోహార్కి చెంచాగిరి చేయడం వల్ల ఆలియా సక్సెస్ అయ్యిందేమో నువ్వు పెయిల్యూర్ ఆర్టిస్ట్వి. ఆలియా కుటుంబాన్ని కాపాడటానికి నిన్ను ఊసిగొల్పారా? ఉంగ్లీ చిత్రీకరణ సమయంలో కంగనాని నువ్వెంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు“ అన్నారు. రంగోలి వ్యాఖ్యలపై కోపగించుకున్న ఆలియా తల్లి సోనీ ట్వీట్ చేశారు. కంగనాకు తన భర్తే మహేశ్ భట్ తొలి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. తర్వాత ట్వీట్ను డిలీట్ చేశారు. అయితే రంగోలి సోని రాజ్దాన్ ట్వీట్కి రిప్లయ్ ఇస్తూ …
`డియర్ సోనీ జీ మహేశ్ భట్ కంగనకు తొలి అవకాశం ఇవ్వలేదు. అనురాగ్ బసు ఇచ్చారు. మహేశ్ భట్కు అసలు నిర్మాణ సంస్థే లేదు. మహేశ్ భట్ నా సోదరితో `వో లమ్హే` తర్వాత `ధోకా` సినిమా చేయాలనుకున్నారు. అందులో సూసైడ్ బాంబర్గా నటించాలని చెప్పారు. నా సోదరి ఒప్పుకోలేదని నోటికొచ్చినట్లు తిట్టారు. `వో లమ్హే` సినిమా ప్రివ్యూ షోకు వెళ్లినప్పుడు థియేటర్లో మీ భర్త నా సోదరిపై చెప్పు విసిరారు. ఆమెను సినిమా చూడనివ్వలేదు. రాత్రంతా కంగనా ఎంత ఏడ్చిందో నాకు తెలుసు“ అన్నారు.
previous post