బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ త్వరలోనే నిర్మాతగా మారుతున్నారు. ఈ విషయంపై ఆమె స్పందించారు. “జనవరిలో నా కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం కానుంది. నా దగ్గరకు వచ్చే ప్రతి కథలో నేను నటించకపోవచ్చు కానీ.. ప్రతి మంచి కథ వెండితెరపై రావాల్సిన అవసరం ఉంది. అందుకనే నిర్మాణ సంస్థను ప్రారంభించాను. ముందుగా చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తాం. అలాగే డిజిటల్ ఫ్లాట్ఫామ్లోనూ అడుగు పెట్టాలనుకుంటున్నాం. అయితే నా ప్రొడక్షన్లో నేను నటించడం లేదు. ప్రస్తుతం `థాకడ్` సినిమాతో బిజీగా ఉన్నాను. దాని తర్వాతే నా డైరెక్షన్లో చేయబోయే సినిమా గురించి ఆలోచిస్తాను“ అన్నారు. ప్రస్తుతం ఈమె జయలలిత బయోపిక్ `తలైవి`లో నటిస్తున్నారు.
previous post