బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో నానుతూనే ఉంటుంది. లెటేస్ట్గా ఈ బ్యూటీ నటించిన మణికర్ణిక సినిమా విషయంలో కూడా అదే జరిగుతోంది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్ని సెంటర్స్ నుంచి పాటిజిట్ టాక్ తెచ్చుకొని బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ దాదాపుగా 50 కోట్ల రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా మొదటి వారంలోనే 100 కోట్లు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
హిట్ అయ్యింది కాబట్టి మణికర్ణిక క్రెడిట్ తీసుకోవాలని ఎవరికి వారు ట్రై చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ సినిమాని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ క్రెడిట్ మొత్తం కంగనే కోట్టేసిందంటూ, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను విస్మరించిందంటూ దర్శకుడు క్రిష్ ఆరోపించాడు. ఇదే విషయంలో కంగనాకు, క్రిష్కు మధ్య విభేదాలు వచ్చాయని ,80 % సీనిమా కంప్లీట్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నానంటున్నాడు. అంతేకాదు తను తీసిన సన్నివేశాలు సినిమాలో ఉన్నప్పటికీ దర్శకురాలినని తన పేరు వేసుకుందని క్రిష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదే విషయంపై కంగనా సిస్టర్ రంగోలి క్రిష్ని పోగుడుతునే వెంటకారంగా కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కీల్లో హాట్ టాపిక్గా మారింది.
మణికర్ణిక సినిమాని కంప్లీట్గా డైరెక్ట్ చేసింది మీరే అది నేను ఒప్పుకుంటాను కానీ మా అక్క ఇమేజ్ని మాత్రం డ్యామేజ్ చేయకండీ ప్లీజ్. ఈ ముచ్చట ఇంతటితో వదిలుయ్యండి అంటూ ట్వీట్ చేసింది. మణికర్ణిక సినిమాని మీరే దర్శకత్వం వహించినప్పటికి ప్రధాన పాత్రలో నటించింది మాత్రం కంగనానే అని మర్చిపోకండి అంటుంది. ఈ సినిమా సక్సెస్ని కంగనాని ఎంజాయ్ చేయ్యనివ్వండి, తనని ఒంటరిగా వదిలేయ్యండి. మీరు నిజాలు చెప్పే సత్య హరిచంద్రుడని నేను నమ్ముతున్నా అనే రేంజ్లో పోగుడుతునే క్రిష్కు కౌంటర్ ఇచ్చింది. మరి ఈ ట్వీట్ పై క్రిష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
previous post
next post