ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మూడు పదుల వయసు ఉన్న చూశాను ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల అసలు కారణాలు ఏమిటి అన్న దాని విషయంలో ఇప్పటికీ బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ముందు నుండి ఈ విషయంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది.ఇండస్ట్రీలో సుశాంత్ ఏదుగుదలను తట్టుకోలేక బాలీవుడ్ మాఫియా, ఖాన్ కుటుంబాల హవా నేపోటిజమ్ వల్లనే అతను చనిపోయాడని ఆరోపించడం అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంలో మరోసారి ఏకంగా ముఖ్యమంత్రి కొడుకు ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేసింది. బేబీ పెంగ్విన్ అంటూ కామెంట్ చేసింది.
సుశాంత్ సూసైడ్ చేసుకునే ముందు రోజు రాత్రి ఒక కీలకమైన వ్యక్తి ఇంట్లో పార్టీ జరిగిందని, ఆ పార్టీలో ఓ ప్రముఖ వ్యక్తి కూడా పాల్గొనటం పాల్గొనటం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె ట్వీట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలుసు, కానీ ఎవరూ ఆ వ్యక్తి పేరు చెప్పటం లేదు…, పైగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కి ప్రాణస్నేహితుడు, ప్రపంచంలోనే గొప్ప సీఎం కొడుకు…. అందరూ ఆయనను ప్రేమగా బేబీ పెంగ్విన్ అని పిలుస్తారు…” అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో కంగనా రనౌత్ చేసిన కామెంట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకును ఉద్దేశించినవే అన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ డిస్కషన్లు స్టార్ట్ చేశారు. దీంతో ఈ వార్త వైరల్ కావటంతో మహారాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇది సంచలనంగా మారిందట. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో జనాల్లో కి వేరేలాగా వెళుతుంది అనే ఆలోచనతో మహారాష్ట్ర సీఎం కొడుకుకి కంగనా కామెంట్లు ముప్పుతిప్పలు పెడుతున్నట్లుగా ఉన్నాయని ఆ రాష్ట్రంలో వార్తలు వినబడుతున్నాయి.