Kantara: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో సెప్టెంబర్ 30న రిలీజ్ అయి రికార్డుల మోత మోగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 40 కోట్ల వసూళ్లను రాబట్టింది కాంతార.. సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంతారా ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు ఓటీటీలో విడుదలైంది.. కానీ విడుదలైన మొదటి రోజే అభిమానుల్ని నిరాశపరిచింది.. సినిమా చూసిన అందరూ పెదవి విరుస్తున్నారు..! అందుకు ఓ పెద్ద కారణం కూడా ఉంది..!
అదేంటంటే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లిన వరాహ రూపం పాటని ఓటీటీలో ట్యూన్ మార్చి కొత్త మ్యూజిక్ తో విడుదల చేశారు. వాస్తవానికి ఈ సినిమాకి ప్రాణం పోసింది వరాహ రూపం పాటే. ఈ సాంగ్ పై మలయాళం మ్యూజిక్ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ నోటీసులు జారీ చేసింది. ఆ సాంగ్ ని తమ నవరస పాట నుంచి కాపీ కొట్టారు అంటూ ఆ నోటీసులో పేర్కొంది. దాంతో ప్రస్తుతం వరాహ రూపం పాట వివాదం కోర్టులో నడుస్తుంది . ఈ నేపథ్యంలో ఎప్పటికే కాంతార సినిమా నిర్మాణ సంస్థ హోంబులే ఫిలిం ఆ సాంగ్ ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. అలాగే ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ నుండి కూడా తొలగించింది. కాంతార సినిమాని ఎప్పటికీ థియేటర్లో చూసిన ప్రేక్షకులు కూడా మరోసారి ఓటీటీలో చూడాలని భావించారు. ఈ క్రమంలో సుమారు 50 రోజులపాటు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశారు. అమెజాన్ ప్రైమ్ కూడా భారీ ధరకి కొనుగోలు చేసి ఈరోజు రిలీజ్ చేసింది.కానీ సినిమా చూసిన అభిమానులు పెదవి విరుస్తున్నారు.
ఒరిజినల్ ట్యూన్ కు ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న ట్యూన్ కు మార్పులు ఉండటంతో సినీప్రియలు నిరాశకు గురవుతున్నారు. కొత్త ట్యూన్ బాగోలేదని దయచేసి పాత పాటనే కొనసాగించమంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రిషబ్ అన్న ఈ ట్యూన్ ఏం బాగోలేదు. పాత ట్యూన్ విన్నప్పుడు వచ్చిన ఆ మార్క్ ఇందులో లేదు. దయచేసి వరాహరూపం పాత పాటనే కొనసాగించండి అంటూ నేటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!