బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు మెల్లగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మెడకు చుట్టుకుంటోంది. మొదట కరణ్ జోహార్ ను ఈ కేసు నుండి తప్పించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఈరోజు కరణ్ జోహర్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతాను అంబోలి పోలీస్ స్టేషన్ లో దాదాపు 3 గంటల పాటు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ధర్మ ప్రొడక్షన్స్ లో సుశాంత్ సింగ్ డ్రైవ్ అనే చిత్రాన్ని చేసాడు. ఆ చిత్ర కాంట్రాక్టును అపూర్వ మెహతా పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కరణ్ జోహార్ ను కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.