Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో దుసుకెళ్తున్నాడు. ఇప్పటికే 2022లో కార్తీ తారాగణంలో రెండు సినిమాలు రిలీజ్ అయి అభిమానులను బాగా అలరించాయి. ఈ ఏడాది కార్తీ ‘ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ‘విరుమన్’ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో కార్తీ చాలా హ్యాపీగా ఉన్నాడు. వీటిలో పొన్నియిన్ సెల్వన్ 1 తమిళంలో హిట్ అయింది. దీని తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయింది కానీ అంతగా హిట్ కాలేదు. విరుమన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రిలీజ్ చేయలేదు. కానీ ‘పసలపూడి వీరబాబు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీలో రిలీజ్ చేశారు.
Karthi: తానొక అసిస్టెంట్ డైరెక్టర్
ప్రస్తుతం ఈ హీరో ‘సర్ధార్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా సర్ధార్ సినిమా 21న రిలీజ్ కానుంది. దాంతో ఈ మూవీ ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. హీరో కార్తీ తన సర్ధార్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. ఇదొక స్పై మూవీ అని కార్తీ అన్నారు. అలానే ఇదే ప్రమోషనల్ ఈవెంట్లో కార్తీ తనకు దర్శకుడు అవ్వాలనే కోరిక ఉందని చెప్పాడు. అలానే తన కెరీర్ స్టార్టింగ్లో డైరెక్టర్ మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన రోజులను గుర్తుచేసుకున్నాడు. తన అన్నయ్య సూర్య సినిమాతోనే అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ప్రారంభమైందని ఈ ‘ఆవారా’ హీరో చెప్పుకొచ్చాడు.
అన్నయ్యతోనే ఫస్ట్ మూవీ
అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రమే కాదు తాను డైరెక్టర్గా చేసే తొలి చిత్రం కూడా తన అన్నయ్య సూర్యదే అవుతుందని స్పష్టం చేశాడు. “అన్నయ్య నన్ను బాగా అర్థం చేసుకుంటారు. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి కారణం మా అన్నయ్యనే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే మా అన్నయ్యని హీరోగా పెట్టి నా డైరెక్షన్లో మూవీ తీయాలనే కోరిక ఉండేది” అని కార్తీ పేర్కొన్నాడు. ఇక సర్ధార్ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కోసం ఇండియాలోని లొకేషన్స్తోపాటు కజకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాలను కూడా వాడారు. భారీ బడ్జెట్తో స్పై థ్రిల్లర్గా వస్తున్న సర్ధార్ సినిమాకి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా.. రాశి ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.