Karthika deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మంచి రసవత్తరంగా సాగింది అనే చెప్పాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో అనేది ముందుగా తెలుసుకుందాం.జ్వల సత్యం సార్ వాళ్ళ ఇంటికి. బిర్యానీ తీసుకుని రావడంతో ప్రేమ్….. నిరూపమ్, హిమలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఈ క్రమంలోనే ప్రేమ్ అమ్మ నాన్న కలిస్తే హిమను పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అని అనుకుంటాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
Karthika deepam: అమ్మా నాన్నలను కలిపే పనిలో పడ్డ ఇరు జంటలు :
మరోవైపు సౌందర్య మాత్రం దీప, కార్తీక్ ల ఫోటో దగ్గర నిలబడి సత్యం,స్వప్నల పరిస్థితి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.ఇంతలో అక్కడకి హిమ వచ్చి సౌందర్యను ఓదార్చుతుంది.ఆ తర్వాత హిమ నిరూపమ్, ప్రేమ్ లు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉండగా వాళ్లకు జ్వాల వడ్డీస్తుంది. ఆ క్రమంలో నిరూపమ్ ఇలా మనం అందరం కలిసి తిన్నట్టే.. మమ్మీ డాడీలు కూడా కలిసి తింటే చాలా బాగుంటుంది.ఇక ఈలోపు సత్యం బాగా తాగి ఇంటికి వచ్చి జ్వాల అన్నం పెడుతుంది రా.. తాను బంగారం అంటూ పొగుడుతాడు.ఇక ప్రేమ్ మాత్రం డాడీ ఎక్కువయిందా.. బంగారం బంగారం అని అంటున్నావ్ అని సత్యను అంటాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
జ్వలను పెళ్లిచేసుకున్న నిరూపమ్ :
ఒక నవ్వు నవ్వి సరే నేను వెళ్తున్నాను అందరూ కడుపునిండా తినండి అని వెళ్ళిపోతాడు సత్య.ఆ తర్వాత నిరూపమ్ కు బిర్యానీ పెడుతూ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు,నిరూపమ్ అలిగిన జ్వాలను బుజ్జగిస్తున్నట్లు కల కంటుంది. కాసేపటికి తిరుకొని ఇదంతా కలా అని అనుకుంటుంది.ఆ తర్వాత నిరూపమ్ మమ్మీ డాడీల మ్యారేజ్ యానివర్సరీ కారణంగా అయినా వాళ్ళిద్దర్నీ కలిపితే మనం భవిష్యత్తులో ఆనందంగా ఉంటామని అంటాడు. ఇదే విషయం గురించి ప్రేమ్, హిమలు సౌందర్య తో కూడా చర్చిస్తారు. ఎలాగయినా ఈ ఫంక్షన్ ని అడ్డుపెట్టుకొని హిమకు ఐ లవ్ యూ చెప్పాలని ప్రేమ్ మనసులో అనుకుంటాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
అక్కా అని పిలిస్తే జ్వాల రియాక్షన్ ఇలా ఉంటుందా…?
సీన్ కట్ చేస్తే జ్వాల చిత్తు పేపర్లు కొనడానికి ఒక షాప్ దగ్గరకు వెళ్తుంది. అదే సమయంలో జ్వాల ఆటోలో పెట్టిన డబ్బులను ఒక వ్యక్తి కొట్టేస్తాడు. అతన్ని గమనించిన సౌందర్య అతని దగ్గర డబ్బు లాక్కొని విషయం జ్వాలకు చెబుతుంది. ఇక దొంగ జ్వాలను తప్పు అయిపొయింది అక్కా క్షమించు అని అనడంతో ఎవర్రా నీకు అక్క అంటూ ఆ వ్యక్తి ని గట్టిగా లాగి చెంపమీద కొడుతుంది.ఇక తరువాయి భాగం లో జ్వాల చిత్తు కాగితాలు తీసుకుని వెళుతుండగా ఆ కాగితల్లో ఆర్టిస్ట్ గీత గీసిన జ్వాల చిత్రం ఉంటుంది.
జ్వల మీద కోపంతో స్వప్న తీసుకున్న నిర్ణయం :
అలాగే నిరూపమ్ వాళ్ళ అమ్మకు వెడ్డింగ్ అనివర్సరీ శుభాకాంక్షలు చెప్తాడు.ఆ తర్వాత మ్యారేజ్ డే ఫంక్షన్ ను జ్వాల మా బస్తీలో జరుపుతాను అని అంటుంది. దాంతో సప్న ఛీ ఛీ.. బస్తిలోనా… ఏమి అక్కర్లేదు మా మ్యారేజ్ డే ఫంక్షను నా కొడుకు నిరూపమ్ చాలా గ్రాండ్ గా జరుపుతాడు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.జ్వాల మీద కోపంతో సత్యతో కలిసి పెళ్లి రోజు జరుపుకోవడానికి స్వప్న ఒప్పుకుంటుంది. స్వప్న మాటలు విని నిరూపమ్ సంతోషిస్తూ జ్వాలకు థాంక్స్ చెబుతూ ఫంక్షన్ లో నీకో విషయం చెబుతా అంటాడు