‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్ 2 బ్యానర్పై ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా‘. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 2020లో షూటింగ్ జరుపుకోనుంది. భిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు.సినిమా గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.
previous post
next post