ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. వివిధ రంగాల్లో ప్రసిద్ధ వ్యక్తులకు సంబంధించిన జీవితాలను సినిమాల రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఆ కోవలో పరుగుల రాణి పి.టి.ఉష జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది. వివరాల ప్రకారం ఈ బయోపిక్లో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ టైటిల్ పాత్రలో నటించనుందట. రేవతి యస్.వర్మ పి.టి.ఉష జీవితాన్ని ఆధారంగా చేసుకుని కథను తయారు చేశారట. కత్రినా కఫ్ను కలిసి కథను కూడా వినిపించారట. ఆమె కూడా ఈ బయోపిక్ చేయడానికి ఆసక్తిగానే ఉన్నారని టాక్. పరుగు పందెంలో ఎన్నో పతకాలు గెలిచి .. యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచారు పి.టి.ఉష. మరి ఈ బయోపిక్కి సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పుడు వెలువడుతుందో చూడాలి.
previous post
next post