కేసీఆర్ ఎక్కడ? కేసీఆర్ ఏమైపోయారు? హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేస్తున్నట్లు? గత రెండు వారాలుగా ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న ఎదురైంది. ఐతే దీనికి ఎట్టకేలకు సమాధానం దొరికింది. దాదాపు రెండు వారాల నుండి ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ఎట్టకేలకు అజ్ఞాతవాసం వీడారు.
కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. త్వరలోనే రైతులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ ఎక్కడ అంటూ విమర్శలు మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని పట్టించుకోకుండా కేసీఆర్ ఎక్కడికో వెళ్లి దాక్కున్నారని విమర్శలు చేసారు. దీనికి కేసీఆర్, కొంత మంది మంత్రులు కేసీఆర్ లేకపోయినా అభివృద్ధి పనులు ఎక్కడా ఆగలేదు కదా అంటూ డిఫెండ్ చేసుకున్నారు.