Mahesh-Keerthy Suresh: సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ నటి కీర్తి సురేష్ కలిసి నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించగా.. తమన్ స్వరాలు అందించారు.
కొద్ది రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 12న గ్రాండ్గా విడుదల కాబోతోంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్స్ను వదులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలకు ముహూర్తం కూడా ఖారరు చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ ను మహేశ్ కంటే ముందే కీర్తి సురేష్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. అలాగే డబ్బింగ్ సమయంలో దిగిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఇన్స్టా పోస్ట్ కాస్త వైరల్గా మారింది.
కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. అలాగే కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం మహేశ్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CdBHwWvl31V/?utm_source=ig_web_copy_link