Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. `మహానటి` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కీర్తి సురేష్కి మరో విజయం దక్కలేదు. ఈమె చివరిగా నటించిన పెంగ్విన్, రంగ్దే, మిస్ ఇండియా చిత్రాలు వరుగా ఫ్లాప్ అయ్యాయి. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్తో కీర్తి సురేష్ తొలి సారి నటించిన చిత్రం `పెద్దన్న(తమిళంలో అన్నాత్తే)`.
శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా.. మీనా, ఖుష్బూలు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఇలాంటి సినిమా కోసం కీర్తి సురేష్ కొన్ని సూపర్ హిట్ చిత్రాలను వదిలేసుకుంది. ఈ లిస్ట్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పోషించిన పాత్ర కోసం మొదట కీర్తి సురేష్నే సంప్రదించారట. కానీ, పెద్దన్న సినిమా కారణంగా ఆమె శ్యామ్ సింగరాయ్ను రిజెక్ట్ చేసింది. కట్ చేస్తే ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో కీర్తి సురేష్ ఇప్పుడు బాధపడుతోందంటూ ప్రచారం జరుగుతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!