Keerthy suresh: కీర్తి సురేష్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా మలయాళంలో పలు సినిమాలు చేసిన కీర్తి సురేష్.. `నేను శైలజ` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే తనదైన అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ అందాల భామ `మహానటి` సినిమాలో సావిత్రిగా నటనా విశ్వరూపం చూపించి స్టార్ స్టేటస్ను దక్కించుకుంది.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాసల్లోనూ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్.. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా `భోళా శంకర్` చిత్రంలోనూ నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. తమిళంలో హిట్టైన వేదాళంకు రీమేక్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.
చిరు, కీర్తిల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారు. అయితే ఇంతలోనే కీర్తి సురేష్ కరోనా బారిన పడటంతో.. భోళా శంకర్ షూట్కి బ్రేక్ పడింది. దీంతో ఎంతగానో నిరాశ చెందుతున్న మెగా ఫ్యాన్స్కు తాజాగా చిరంజీవి కూడా చెప్పలేనంత పెద్ద గుడ్న్యూస్ను కీర్తి సురేష్ చెప్పింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల కరోనాకు గురైన కీర్తి చాలా త్వరగా ఆ మహమ్మారిని జయించింది.
ఇదే విషయాన్ని తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. `ఈరోజుల్లో నెగెటీవ్ అనేది పాజిటీవ్ పదం అయిపోయింది. తనకు నెగెటీవ్ అని తెలిసిన వెంటనే ఊపిరి పీల్చుకున్నాను` అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చిన కీర్తి సురేష్ కొన్ని సెల్ఫీ ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
'Negative' can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! 🤗❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!