Keerthy Suresh: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. ఫస్ట్ మూవీలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఈ భామ `మహానటి`తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈమె పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి `సర్కారు వారి పాట` సినిమా చేస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా `భోళా శంకర్`లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ఈమె నటించిన `సాని కాయిదమ్(తెలుగులో చిన్ని)` అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న రిలీజ్ కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక కెరీర్ ఆరంభం నుంచీ కీర్తి కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తోంది. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా గ్లామర్ పాత్రల జోలికే పోవడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్.. తాను గ్లామర్ పాత్రలు చేయకపోవడం వెనక కారణం ఏంటో స్పష్టంగా వివరించింది.
ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. ` స్కిన్ షో చేయడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. మొదటి నుంచి కూడా నేను నటనపైనే దృష్టి పెట్టాను. అదృష్టం కొద్దీ అలాంటి పాత్రలే వచ్చాయి. ఇకపై కూడా అలాంటి పాత్రలతోనే మిమ్మల్ని అలరిస్తారు. అలాగే తెరపై ఎలా కనిపించాలి అనే విషయంలో నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. డబ్బు కోసం నేను వాటిని అధిగమించలేను.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె వ్యాఖ్యలు అభిమానులు మరియు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.