కీర్తి సురేశ్కు ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. `మహానటి`తో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి సురేశ్ తర్వాత ఎక్కువగా తమిళ చిత్రాల వైపుకే మొగ్గు చూపింది. అయితే అవేవీ ఆమెకు సక్సెస్ తెచ్చిపెట్టలేదు. దాంతో ఓ డెబ్యూ డైరెక్టర్తో కలిసి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. అలాగే రీసెంట్గా కింగ్ నాగార్జునతో `మన్మథుడు 2`లో జత కట్టింది. కాగా ఇప్పుడు నాగార్జున బ్యానర్లోనే మరో అవకాశం దక్కింది. `సోగ్గాడే చిన్ని నాయనా` సినిమా సీక్వెల్ `బంగార్రాజు`లో చైతన్య సరసన కీర్తి సురేశ్ పేరుని హీరోయిన్గా పరిశీలిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.
previous post
next post