దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ అందరికి సుపరిచితురాలే. తెలుగు సినిమా రంగంలో దాదాపు టాప్ హీరోల అందరి సరసన అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తూ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో చేయగా ఇటీవల మహేష్ బాబు సరసన “సర్కారు వారి పాట” సినిమాతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకపక్క తెలుగు మరోపక్క తమిళ సినిమాలతో బిజీగా ఉండే కీర్తి సురేష్ వెబ్ సిరీస్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది.
ఇప్పటివరకు కీర్తి సురేష్ నటించిన అన్ని సినిమాలలో అందాల నటి సావిత్రి బయోపిక్ “మహానటి”తో మంచి గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. ఈ సినిమాకి గాను కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటున్న కీర్తి సురేష్ ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ ఫీలింగ్ కెరీర్ గురించి అనేక విషయాలు తెలియజేశారు.
“సాని కాగితం” సినిమా విశేషాలు గురుంచి .. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అందరి హీరోల కంటే విజయసేతుపతి నటన అంటే చాలా ఇష్టమని స్పష్టం చేసింది. ఇంకా అవకాశమొస్తే రాజమౌళి అదే విధంగా మణిరత్నం సినిమాలలో చేయాలని తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. ఇక రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మూడు భాషల్లో చేస్తున్నాను అన్నిటిలో కూడా ఓకే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను. కొన్ని సందర్భాలలో తగ్గించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అని కీర్తి సురేష్ మాట్లాడుతూ ఇంకా “సాని కాగితం” విశేషాలు తెలియజేయడం జరిగింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన “సాని కాగితం” ఓటిటిలో రిలీజ్ కానుంది.