మహానటి సినిమాతో యాక్టింగ్ లో తనకు తానే సాటి అని నిరుపించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె యాక్టింగ్ కు అవార్డులు తన్నుకుంటూ తన దగ్గరకు వచ్చేశాయి. నేషనల్ అవార్డు సైతం తనను వరించాయి. ప్రస్తుతం ఓటీటీలో మిస్ ఇండియా చిత్రం అందరిని అలరిస్తోంది. అలాగే రానున్న పలు చిత్రాలతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది.
కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రంగ్ దే, సర్కారు వారి పాట వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే తమిళంలోనూ వరుస ఆఫర్లుతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే కీర్తి నటించిన మిస్ ఇండియా సినిమా బుధవారం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కీర్తి సురేష్ తన ట్విటర్ ద్వారా ఫ్యాన్స్ తో మాట్లాడారు. అక్కడ వారందరూ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తిక సమాధానాలు ఇచ్చి అందరిని మెప్పించారు.
ఒకరు ట్వీటర్ ద్వారా సర్కారు వారి పాట లో అవకాశం వచ్చినపుడు మీకు ఎలా అనిపించింది? అని అడిగారు. దానికి సమాధానంగా చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అలాగే షూటింగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా అని చెప్పింది. మరొకరు మీకు ఇష్టమైన క్రికెటర్ ? ఎవరని అడిగారు. దానికి ధోనీ సమాధానం ఇచ్చింది తను. ఇంకొకరు సమంత గురించి ఏం చెబుతారని అడిగారు. దానికి సమాధానంగా
సమంత గురించి ఒక్కమాట సరిపోదని చెప్పింది. సమంత వెరీ స్మార్ట్. ప్రయోగాలకు వెనుకాడరని పేర్కొంది.
మరో అభిమాని మీరు సింగిల్ ? కమిటెడ్ హా.. అని అడిగారు. దానికి సమాధానంగా ఆమె తన వృతి పట్ల కమిటెడ్ అంటూ కూల్ గా సమాధానం ఇచ్చింది. ఇంకొకరు సర్కారు వారి పాటకు డబ్బింగ్ చెబుతారా ? అని అడిగారు. దానికి కచ్చితంగా చెబుతానని ఆమె సమాధానం ఇచ్చింది. మరో అభిమాని జాతీయ అవార్డు అందుకుంటున్నప్పుడు ఎలా ఫీలయ్యారని అడిగారు. దానికి కీర్తి సమాధానంగా చాలా భయపడ్డానని తెలిపారు. కృతజ్ఞురాలిగా ఫీలయ్యానని చెప్పుకొచ్చారు. అలాగే అది నమ్మలేని అనుభూతిగా చెప్పారు. మరొకరు బొద్దుగా ఉండే కీర్తిని ఎప్పుడు చూస్తామని అడిగారు. దానికి కీర్తి సురేష్ నవ్వుతూ..త్వరలోనే అని చెప్పింది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!