KGF 2: కరోనా వేవ్ కారణంగా అన్నీ సినిమాల రిలీజులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇలా వాయిదా పడటం ఒకసారి కాదు మూడు నాలుసార్లు వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన సినిమాలలో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కొవిడ్ థర్డ్ వేవ్ సెట్ అయింది. ఈ వేవ్ ఉన్నప్పుడే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలు వచ్చి భారీ హిట్ సాధించాయి. దాంతో ఇక అన్నీ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈసారి ఎలాగైనా థియేటర్స్లో సినిమాలు సందడి చేయాల్సిందే అని దర్శక, నిర్మాతలు స్ట్రాంగ్ గా డిసైడయ్యారు.
ఈ నెల 25వ తేదీన భీమ్లా నాయక్ సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా వసూళ్ళ మీద భారీ అంచనాలున్నాయి. పవన్ కెరీర్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అభిమానులే కాదు, ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత రాధే శ్యామ్ రాబోతోంది. దీని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ వచ్చే నెలలోనే రిలీజ్ కానుంది. ఇలా రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఒకే నెలలో వస్తుండటం విశేషం. ఇక ఏప్రిల్ నెలలో ఆచార్య సినిమా రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా ఇది.
KGF 2: ఆచార్య కంటే ముందే వచ్చేస్తోంది..
ఇక ఇదే నెలలో ఆచార్య కంటే ముందే వచ్చేస్తోంది..కేజీఎఫ్ సీక్వెల్ మూవి. యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ యాక్షన్ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియన్ సినిమాగా పలు భాషలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే, ఈ మధ్య కేజీఎఫ్ 2 మరోసారి వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ, విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న వచ్చేస్తుందట. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.