KGF 2 :ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కేజిఎఫ్-2 టీజర్ ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ టైమ్ లోనే భారీ స్థాయిలో వ్యూస్ రాబట్టి కేజిఎఫ్-2 భారతీయ చలన చిత్ర రంగం యొక్క దమ్ము ఏంటో సినీ ప్రపంచానికి చాటి చెప్పింది. సోషల్ మీడియాలో ఇంకా టీజర్ వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి పార్ట్ ఊహించని విధంగా విజయం సాధించడంతో సెకండ్ భాగానికి కూడా భారీగానే ఆదరణ లభిస్తుంది.
భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కళ్లుచెదిరే రీతిలో జరుగుతున్నట్లు టాక్ వస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే ఈ సినిమాకి సంబంధించి నైజాం రైట్స్ కోసం భారీ గా పంపిణీదారులు పోటీ పడుతున్నారట. తెలుగు రాష్ట్రాలలో 53 ఏరియా కలెక్షన్లు అంటే మామూలుగా ఉండదు అని అందరికీ తెలుసు.
కొన్ని కోట్లల్లో అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటది. దీంతో కేజీఎఫ్-2 నైజాం థియేట్రికల్ హక్కులకు మేకర్స్ భారీ రేట్ ఫిక్స్ చేశారట. 75 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో పాటు మరికొంతమంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పోటీ పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా రాబోయే వేసవి లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?