“కేజిఎఫ్” రెండు పార్ట్స్ ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలుసు. “కేజిఎఫ్ 2” అయితే ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆ సినిమాలో యాక్షన్ పార్ట్ చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా హీరోఇజం ఎలివేషన్ అయితే ఓ రేంజ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూపించడం జరిగింది. హీరో యాష్ కూడా సన్నివేశానికి తగ్గ రీతిలో మాస్ పల్స్ కి మరింత దగ్గరగా తన హావభావాలతో ఫైట్స్ తో చాలా అదరగొట్టాడు.
అయితే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ డైరెక్టర్స్ గా పనిచేసిన అన్బు, అరివు ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా “ప్రాజెక్టుకే” తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే నటిస్తోంది. అమితాబచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
హాలీవుడ్ టెక్నాలజీ తో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ చాలా హైలెట్ గా తెరకెక్కించాలని మేకర్స్ డిసైడ్ అయ్యి “కేజిఎఫ్” యాక్షన్ డైరెక్టర్స్ అన్బు, అరివు ఆధ్వర్యంలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. వచ్చే నెల ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!