KGF 2 Trailer: కోలీవుడ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `కెజియఫ్`. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. హోమ్ బలే ఫిల్మ్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ చిత్రం 21 డిసెంబర్ 2018న పాన్ ఇండియాలో స్థాయిలో విడుదలై భారీ విజయం సాధించింది. రూ. 80 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా లాంగ్ రన్లో రూ. 243 నుంచి 250 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.
అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `కెజియఫ్ 2` రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదా అనంతరం ఏప్రిల్ 14న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ అన్ని భాషల్లోనూ ట్రైలర్ను విడుదల చేశారు. తెలుగుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదగా కెజియఫ్ 2 ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే బయటకు వచ్చింది.
ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చే మూవెంట్స్ చాలానే ఉన్నాయి. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ టైలర్లో నింపేశారు. దీనిని చూస్తుంటే..చాప్టర్ 1ను మించి చాప్టర్ 2 ఉండబోతోందని స్పష్టంగా అర్థం అవుతోంది. `కేజీఎఫ్లో గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది..? మీరు చదువుతారా..?` అనే డైలాగ్తో స్లోగా ప్రారంభమైన ఈ షో.. చివరకు పిక్స్కు చేరుకుంది.
మరోసారి యష్ నటనతో అదరగొట్టాడు. విజులవల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. కాగా, చాప్టర్ 2లో సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాశ్ రాజ్, రవీన కీలక పాత్రలను పోషించారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.