Tollywood: హీరో యాష్ తో “కేజిఎఫ్” సినిమా చేసి టాప్ మోస్ట్ హిట్ అందుకున్ని దేశవ్యాప్తంగా అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫస్ట్ “కేజిఎఫ్” కన్నడంలో తియ్యగా అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యి తర్వాత మిగతా భాషల్లో రిలీజ్ అయ్యి అనేక రికార్డులను సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులను ఇప్పుడు “కేజిఎఫ్ 2” పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ పై పెట్టినట్లు ఆయన వ్యవహరిస్తున్న తీరును బట్టి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోలతో ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఇప్పటికే “సలార్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Read More: KGF : కేజీఎఫ్ డైరెక్టర్తో ప్రభాస్ దిల్ రాజుల హ్యాట్రిక్ పాన్ ఇండియన్ సినిమా ..?
ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆ తర్వాత స్టైలిష్ స్టార్ బన్నీ తో పాటు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మళ్లీ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. అంతమాత్రమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు టాక్. మొత్తం బడా హీరోలు కావడం తో పాటు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్న యట.