KGF 2: “కేజిఎఫ్”తో ఓవర్ నైట్ లోనే దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ హీరో యాష్ సంపాదించుకోవడం తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు యాష్ పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయువు పట్టు అయిన ముంబై వంటి మహానగరాలలో కొన్ని వందల అడుగుల కటౌట్ లు యాష్ కి కడుతున్నారు. బాలీవుడ్ బడా డైరెక్టర్ లు సైతం యాష్ ఓకే అంటే సినిమా చేయడానికి రెడీ గా ఉంటున్నారు. మరోపక్క యాష్ మాత్రం వచ్చిన క్రేజ్ సద్వినియోగం చేసుకునేదిశగా చాలా జాగ్రత్తగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వచ్చిన పాపులారిటీ ఏమాత్రం చేజారి పోకుండా పక్కా ప్లానింగ్ తోనే వెళ్తున్నాడు. కేజిఎఫ్ తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ రావడంతో హీరో యాష్ క్రేజ్ క్యాష్ చేసుకోవటానికి చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఒక పాన్ మసాలాకి సంబంధించి… ప్రముఖ కంపెనీ హీరో యాష్ చేత యాడ్ చేయించడానికి చర్చలు జరిపింది. అంతమాత్రమే కాదు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ హీరో యాష్ .. ప్రజలకు హాని కలిగించే వంటి ప్రొడక్ట్స్ కి.. సపోర్ట్ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గతంలో ఇదే తరహాలో ఐకాన్ స్టార్ బన్నీకి కూడా ఒక ప్రముఖ పొగాకు కంపెనీ కి సంబంధించి యాడ్ చేయాలని ఆఫర్ వచ్చింది, గ్యారెంటీగా చేయన్నని తేల్చిచెప్పేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో షారుక్, అక్షయ్, అజయ్ దేవగన్… వంటి వారు పాన్ యాడ్ చేస్తే వాళ్ళ మీద విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా హీరో యాష్ .. పాన్ యాడ్ కి నో చెప్పటంతో.. బన్నీ బాటలోనే కేజిఎఫ్ హీరో నడుచుకుంటున్నారని.. సోషల్ మీడియాలో ఈ వార్తపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదే వార్తపై బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్ హీరోలకు.. విలువలు ఉంటాయని.. పొగుడుతున్నారు.