KGF: “కేజిఎఫ్” సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018 వ సంవత్సరంలో కన్నడ భాషలో సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇతర భాషల్లో .. రిలీజ్ అయ్యి అనేక రికార్డులను సృష్టించటం మనకు తెలిసిందే. “కేజిఎఫ్” విజయంతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్..స్టార్ హీరోగా యాష్ మారిపోయారు. ముఖ్యంగా యాష్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కి కన్నడంలో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు.
ఒక విధంగా చెప్పాలంటే “బాహుబలి” తో ప్రభాస్ ఇమేజ్ ఎలా రెట్టింపు అయిందో అదే రీతిలో “కేజిఎఫ్” సినిమాతో యాష్ ఇమేజ్ కూడా రెట్టింపయ్యింది. ప్రస్తుతం యాష్ “కేజిఎఫ్ 2” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రను సంజయ్ దత్ నటించడంతో దేశవ్యాప్తంగా సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే రీతిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికి యాష్ మరో క్రేజీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినట్లు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాష్ సినిమా చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. చాలా డిఫరెంట్ హై వోల్టేజ్ మాఫియా సబ్జెక్టు యాష్ కి ఇటీవల పూరి వినిపించినట్లు అంతా ఓకే అయినట్టు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో “లైగర్” చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత యాష్ తో చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.