RRR KGF2: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. బాహుబలి తర్వాత అదే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా జనవరి 7వ తారీకు ఈ ఏడాదిలో విడుదల కావాల్సి ఉండగా… మహమ్మారి కరోనా కారణంగా.. అనేక వాయిదాల పడుతూ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సినిమా వాయిదా పడి మార్చి 25 విడుదల కావటం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో నిర్మాతలు భారీ ఎత్తున జనవరి 7 విడుదల టైంలో ఖర్చు పెట్టగా ఆ తర్వాత… ఒక్కసారిగా సినిమా పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఈ క్రమంలో సినిమా యూనిట్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా తెలివిగా దేశవ్యాప్తంగా.. మీడియా సమావేశాలు పెట్టి ప్రమోట్ చేశారు.
ఆయా రాష్ట్రాలలో పేరుగాంచిన ప్రదేశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించి.. ఈ సినిమా గురించి రాజమౌళి మరియు చరణ్, ఎన్టీఆర్ పంచుకునేవారు. ఇప్పుడు ఇదే తరహాలో “ఆర్ఆర్ఆర్” మాదిరిగానే “కేజిఎఫ్ 2” మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు జరిపించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. “కేజిఎఫ్” మొదటి భాగం.. విడుదలైన ప్రతి చోటా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా విజయం సాధించడంతో ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల అవుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలలో “ఆర్ఆర్ఆర్” మాదిరి ప్రమోషన్ కార్యక్రమాలు “కేజిఎఫ్ 2” సినిమా యూనిట్ నిర్వహించడానికి రెడీ అయింది. తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచిన ప్రదేశాల వద్ద మీడియా సమావేశాలు పెట్టడానికి రెడీ అయింది. ఏప్రిల్ 11 వ తారీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పుణ్యక్షేత్రం వద్ద ఉదయం ఎనిమిది గంటలకు ఆ తర్వాత సింహాచలం దేవాలయం వద్ద పదిన్నర గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం శాఖ పట్టణం లో కూడా మీడియా సమావేశం నిర్వహించి చివరిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో … “కేజిఎఫ్ 2” భారీ ఎత్తున మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఒక్క తెలుగు స్టేటస్ లోనే … ఇన్ని మీడియా సమావేశాల అంటూ సినిమా లవర్స్ నోరెళ్లబెడుతున్నారు.