Khushboo: ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్న మరోపక్క తమ వారసురాలను ఫీల్డ్ లోకి దింపుతున్నారు. ఈ విషయంలో స్వర్గీయ తార శ్రీదేవి అందరికంటే ముందు ఆలోచన చేయడం జరిగింది. శ్రీదేవి రీఎంట్రీ ఇచ్చి తర్వాత తన పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ని.. హీరోయిన్ గా సినిమా రంగంలోకి దింపడం తెలిసిందే. కానీ జాహ్నవి కపూర్ మొదటి సినిమా విడుదల అయినప్పటికీ శ్రీదేవి మరణించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ ప్రస్తుతం శ్రీదేవి వారసురాలిగా రంగంలోకి దిగిన జాహ్నవి కపూర్… బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా రావడానికి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే మరొక సీనియర్ హీరోయిన్ కూతురు కూడా రాబోతోంది. పోస్ట్ విషయంలోకి వెళితే సీనియర్ హీరోయిన్ కుష్బూ పెద్ద కుమార్తే అవంతిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు.. కుష్బూ స్పష్టం చేయడం జరిగింది.
నా పెద్ద కూతురు అవంతిక ఎన్నోకలలతో లండన్ లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె సొంతంగా నిలదొక్కుకోవాలి. కాబట్టి ఇప్పుడే నా పెద్ద కూతురు అసలైన పోరాటం ప్రారంభమైంది. మేం ఆమె కెరీర్ కి సంబంధించి ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. లాంచ్ చేయడం లేదు. సిఫార్సు చేయటం లేదు. మీరే ఆమెను దీవించాలి అంటూ సోషల్ మీడియాలో కుష్బూ తనదైన శైలిలో… కూతురు సినిమా రంగం ఎంట్రీ గురించి పోస్ట్ పెట్టడం జరిగింది. కుష్బూ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.