Tollywood: ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు గా వెలుగుతున్న వారు పూజా హెగ్డే, రష్మిక మందన. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సినిమాల్లో ఎక్కువగా స్టార్ హీరోల సరసన నటిస్తున్న హీరోయిన్లు విషయానికొస్తే వీరిద్దరి పేర్లు వినబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఓ ఇద్దరు హీరోయిన్లను కాదని దాదాపు మూడు కోట్లు అది కూడా ఫ్లాప్ హీరోయిన్ కి ఇవ్వటానికి సౌతిండియాలో సినిమా యూనిట్ రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
ఆ ఫ్లాప్ హీరోయిన్ మరెవరో కాదు కియారా అద్వానీ. “భరత్ అనే నేను” తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ… రెండో సినిమా “వినయ విధేయ రామ” తో అట్టర్ ఫ్లాప్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకుండా పోయాయి. దెబ్బకి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసిన కియారా అక్కడ అవకాశాలు అందుకుంటూ కెరియర్ రాణిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల కియారా అద్వానీ సోషల్ మీడియాలో సౌత్ సినిమా ఒప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
Read More: Tollywood Directors: టాలీవుడ్ డైరక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్..! తెరకెక్కేనా..?
దీంతో చాలా వరకు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అని అంటున్నారు. కియారా అద్వాని కి పాన్ ఇండియా ఇమేజ్ వుండటంతో.. ఆమెను మూడు కోట్లకు లాక్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఇదే తరుణంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ అన్నట్లు.. కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ రెండిటిలో కియారా ఏ ప్రాజెక్టు ఒప్పుకున్నది అన్నది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రపడ్డ.. కియారా కి మూడు కోట్ల రెమ్యునరేషన్ అందివ్వడానికి నిర్మాతలు రెడీ అవటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ న్యూస్ గా మారింది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!