బాహుబలి సిరీస్ తో ప్రభాస్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ కు ఆఫర్లు కుప్పలు కుప్పలుగా వచ్చాయి. కానీ.. ఆచీతూచీ కథలను ఎంపిక చేసుకుంటున్నాడు.
బాహుబలి సిరీస్ తర్వాత సాహో సినిమాలో నటించిన ప్రభాస్.. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తాడు. ఆ తర్వాత బాహుబలిని మించిన ప్రాజెక్టు ఆదిపురుష్ లో నటించనున్నాడు.
ఇక.. ఏ సినిమాకు రాని హైప్ ప్రస్తుతం ఆదిపురుష్ కు వస్తోంది. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే ఎన్నో సంచలనాలకు తెర లేపుతోంది.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్ డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారట. డైరెక్టర్ ఓం రావత్. ఇక.. సీతగా ఎవరిని తీసుకోవాలన్న దానిపై మూవీ యూనిట్ బాగానే వర్కవుట్ చేస్తోంది.
ఎందుకంటే.. ఆదిపురుష్ లో రాముడి పాత్ర ఎంత ముఖ్యమో.. సీత పాత్ర కూడా అంతే ముఖ్యం. అయితే.. సీత క్యారెక్టర్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లే వినిపించాయి. కీర్తి సురేశ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి పేర్లు వినిపించినా.. సీత రోల్ కోసం కియరా అద్వానిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా దీపికా పదుకొణెను ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. చివరకు కియరాకే ఫిక్స్ అయ్యారట.
కియరా అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్. తనకు రెండు ఇండస్ట్రీలలో ఫ్యాన్స్ ఉన్నారు. రెండు ఇండస్ట్రీలలోనూ తనకు సూపర్ హిట్ సినిమాలు ఇన్నాయి. ఎలాగూ ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమా. అటు సౌత్, ఇటు నార్త్ సినిమా అభిమానులకు కియారా పరిచయం అక్కర్లేని పేరు. అందులోనూ చీరకట్టులో కియరా చాలా అందంగా ఉంటుంది. దీంతో సీత రోల్ కు కియరా అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని అనుకున్నారో ఏమో.. చివరకు కియరాను ప్రభాస్ జోడిగా సెట్ చేశారట.
మొత్తానికి కియరాను సీతగా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక.. ఈ సినిమాకు సంబంధించి పలువురు టాలీవుడ్ స్టార్స్ కు కూడా పిలుపు వచ్చిందట. మొత్తానికి అటు టాలీవుడ్ స్టార్లు, ఇటు బాలీవుడ్ స్టార్లు ఈ సినిమాలో నటించనున్నారన్నమాట.