Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్ ఇటీవలె `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు బడా దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్లో `స్పిరిట్` ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో ఇటు సౌత్తో పాటు అటు నార్త్లోనూ పాపులర్ అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్కు ఇది 25వ చిత్రం కాగా.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై భూషణ్ కుమార్ నిర్మించబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రశాంత్ నీల్ తో చేస్తున్న `సలార్` పూర్తైన వెంటనే ప్రభాస్.. `స్పిరిట్`ను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా ఏ హీరోయిన్ నటించబోతోందనే ఆసక్తి ఎందరిలోనో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. స్పిరిట్ లో ఆఫర్ కోసం ఇద్దరు భామలు పోటీ పడుతున్నారట. వారెవరో కాదు రష్మిక మందన్నా, కియారా అద్వానీ.
ఇప్పటి వరకు ఈ ఇద్దరు బ్యూటీలు ప్రభాస్తో జోడీ కట్టింది లేదు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఖరారు చేయాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట. మరి కియారా, రష్మికల్లో ప్రభాస్కు జోడీ అయ్యేది ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, కియారాతో ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా `కబీర్ సింగ్` మూవీ చేశారు. అలాగే రష్మికతో ప్రస్తుతం ఆయన `యానిమల్` చేస్తుండటం విశేషం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!