Kiara: అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్లో ఇరగదీస్తోంది కియారా అద్వానీ. హిట్, ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం RC15 సినిమా చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘భూల్ భులయ్యా 2’ సినిమా చేసింది. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్లో ఉంది కియరా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కియారా…
సౌత్లో మెగాపవర్స్టార్, సూపర్ స్టార్స్తో జోడి కట్టిన కియారా మూవీస్లో..ఒకటి హిట్ మరొకటు ఫ్లాప్ అయ్యాయి. బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’సినిమాలో యాక్ట్ చేసిన కియారాకు మంచి పేరొచ్చింది.ఆ సినిమా తర్వాత అటు బాలీవుడ్లో ఆఫర్లు వరుసబెట్టి వచ్చాయి.అక్షయ్ కుమార్తో ‘లక్ష్మీ’ సినిమాలో నటించింది. అంతకు ముందు ఈమె అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించిన ‘గుడ్ న్యూస్’లో తన నటనతో ఆకట్టుకుంది. హిట్, ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా టాలీవుడ్లో కియారా అద్వానీకి ఆఫర్లు వరుసబెట్టి వస్తున్నాయి. ప్రస్తుతం రామ్చరణ్తో శంకర్ మూవీలో యాక్ట్ చేస్తోంది.ఇది ప్యాన్ ఇండియా కంటే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ రోజు అదృష్టం వల్ల బతికానేమో..
తాజాగా, ‘భూల్ భులయ్యా 2’ సక్సెస్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. ‘నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. అని తెలిపింది కియరా. ఇదే ఇంటర్వ్యూలో తన గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చావుని దగ్గరగా చూశాను అని షేర్ చేసుకుంది. కియారా తనకి జరిగిన ఆ అనుభవం గురించి మాట్లాడుతూ.. ”కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.’ అని కియరా పేర్కొంది.