నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల హావానే నడిచింది. అయితే ఈ బ్యూటీస్ ఫేస్ జనాలకు పాత పడిపోవడంతో దర్శకులు, నిర్మాతలు కొత్త హీరోయిన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా కొత్త హీరోయిన్స్ అయితే రెమ్యూనరేషన్ కూడా తగ్గుతుందనే భావనతో వాళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడు స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్గా కియారా అద్వాణీ కనిపిస్తోంది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి రెండో సినిమాతోనే మరో స్టార్ హీరో రామ్ చరణ్తో వినయ విధేయ రామ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఫై ఫోకస్ పెట్టిన బోయపాటి కియారాని మాత్రం సైడ్ చేశాడు. ఈ సినిమాలో ఈ బ్యూటీ కేవలం సాంగ్స్కు, ఒకటి రెండు సీన్స్కు తప్ప నటించాడనికి పెద్దగా స్కోప్ లేదు కానీ అమ్మడి గ్లామర్ కి మాత్రం హండ్రెడ్ మార్కులు పడిపోయాయి. దీంతో యంగ్ స్టార్ హీరోలంతా కియారా అద్వాణీతో నటించాడనికి ఓకే చెబుతున్నారు. వినయ విధేయ రామ సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలకు సైన్ చేసింది.
రెండో సినిమాతోనే టాప్ పొజిషన్ అందుకోవచ్చు అనుకున్న కియారా ఆశల మీద వినయ విధేయ రామ చిత్రం నీళ్లు చల్లింది. దీంతో బాగా అప్సెట్ అయిన కియారా స్టోరీస్ విషయంలో ఆచితూచి అడుగేయాలని భావిస్తోందట. మంచి కంటెంట్ ఉండే ఒక్క భారీ సినిమా కోసం ఎదురు చూసిన కియారాకి ఇప్పుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా సెలక్ట్ అయింది. మూడో సినిమా కూడా స్టార్ హీరోతో నటించే ఛాన్స్ రావడం, దానికి త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తోడవ్వడంతో ఈ బ్యూటీ తెగా సంబరపడిపోతుందట. ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్న ఈ ముంబై బ్యూటీ తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసిందని తెలుస్తోంది. మరి అమ్మడు అనుకుంటున్నట్టు టాలీవుడ్లో టాప్ పోజిషన్కు వెళ్తుందో లేదో చూడాలి.