Bheemla Naayak: “బీమ్లా నాయక్” సినిమాని కావాలని ఏపీ ప్రభుత్వం అడ్డుకుంది అంటూ ఇటీవల నాగబాబు మరియు టీడీపీ నేతలు..ఆ పార్టీకి మద్దతుగా ఉండే చానల్స్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండడం కోసం..”బీమ్లా నాయక్” సినిమా విషయంలో వైసీపీ పార్టీని కార్నర్ చేశారని.. ఆరోపించారు. తన పొలిటికల్ మైలేజ్ కోసం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడుకుంటున్నారని.. తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. టికెట్ల ధరల విషయంలో కొద్ది రోజులు ఆగి ఉంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన… జీవో వచ్చి ఉండేదని.. కావాలని ముందుగానే “బీమ్లా నాయక్” నీ విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని కూడా వాడుకుంటున్నారని .. దారుణం అని అన్నారు. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. సినిమా థియేటర్ల విషయంలో కమిటీ వేయడం న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. అన్ని అంశాలను పరిశీలిస్తున్న సమయంలోనే మంత్రి గౌతమ్ రెడ్డి మరణించారు. కాగా స్పష్టమైన జీవో కొద్ది సమయంలో వస్తుందని తెలిసి కూడా..”బీమ్లా నాయక్” ముందుగానే రిలీజ్ చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేశారు.
ఈ విషయాలన్నీ సినిమా నిర్మాతలకు తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. అయినా కానీ ఉద్దేశపూర్వకంగానే సినిమాని ముందే రిలీజ్ చేశారు. తమ పొలిటికల్ మైలేజ్ కోసం సినిమా నిర్మాతలకు నష్టం తెచ్చారు. తన కోసమే ఏపీ ప్రభుత్వం థియేటర్ల విషయంలో… నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుందని.. పవన్ అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అందాల్సిన రెమ్యూనరేషన్ ఎప్పుడో అందిందని కొడాలి నాని పేర్కొన్నారు. ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాలను… పాటిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడం.. కోసం.. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా “బీమ్లా నాయక్” సినిమా పై రాద్ధాంతం చేస్తుందని.. ఈ ట్రాప్ లో నాగబాబు, పవన్ కళ్యాణ్.. పడకుండా ఉండాలని సూచించారు.