Koratala siva : భారీ స్కెచ్ వేసిన కొరటాల..ఎన్టీఆర్ – చరణ్లతో ఆర్ఆర్ఆర్ మించిన పాన్ ఇండియన్ సినిమాలు చేయబోతున్నారు. రచయితగా పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన కొరటాల ఆ తర్వాత ప్రభాస్ హీరోగా మిర్చి సినిమా తీసి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాలు తీసి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఏకంగా మెగా మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం అందుకున్నారు.
అదే ఆచార్య సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల మహేశ్ బాబు స్థానంలో చిరు తనయుడు చరణ్ వచ్చి చేరాడు. దాంతో స్క్రిప్ట్లో పలు మార్పులు చేసి దీనిని మెగా మల్టీస్టారర్గా కొరటాల శివ రూపొందించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్స్తో అదే పాన్ ఇండియా సినిమాలను రూపొందించడానికి రెడీ అవుతున్నట్టు లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
Koratala siva : అప్పుడు చరణ్కు చెప్పిన కథనే మరోసారి
ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటాల కొత్త ప్రాజెక్ట్ను మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇక చరణ్ హీరోగా చేసే సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో ఇవ్వబోతున్నారట. మిర్చి తర్వాతే చరణ్ – కొరటాల కాంబోలో సినిమా రావాల్సింది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది కూడా. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ అప్పట్లో పట్టాలెక్కకుండా ఆగిపోయింది. అయితే, అప్పుడు చరణ్కు చెప్పిన కథనే మరోసారి ఇప్పుడు నరేట్ చేసి దానినినే పాన్ ఇండియా స్క్రిప్ట్గా డెవలప్ చేసి చేయనున్నట్టు సమాచారం.