టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ కొరటాల శివ ఒకప్పుడు ఒక ఫ్లాప్ లేని దర్శకుడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను ఈ నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు దక్కించుకుని తెలుగులోని స్టార్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల “ఆచార్య”తో ఫస్ట్ టైం అట్టర్ ఫ్లాప్ సొంతం చేసుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అల్లరించలేకపోయింది. ఈ సినిమా కొన్న ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టలు చూడడం జరిగింది. ఇదిలా ఉంటే “ఆచార్య” నిర్మాణ భాగస్వామ్యంలో కొరటాల స్నేహితులు ఉండటంతో… కొన్ని ప్రాంతాలకు సంబంధించి సినిమా రిలీజ్ అవ్వకుండానే భారీ ధరకు కొరటాల సినిమా హక్కులు అమ్మడం జరిగిందట.
అయితే “ఆచార్య” కనీస కలెక్షన్ లు రాబటలేదు. దీంతో గత రెండు రోజుల నుండి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు కొరటాల కార్యాలయం వద్ద ధర్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో కొరటాల సన్నిహితులు సినిమా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో వాళ్ళందరికీ సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కొరటాల శివ పై ఉండటంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారట. మేటర్ లోకి వెళ్తే నష్టపోయిన వారందరికీ తిరిగి డబ్బులు చెల్లించటానికి హైదరాబాదులో ఒక ప్రధాన ప్రాంతంలో దాదాపు 40 నుంచి 45 కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్ అమ్మేయటానికి కొరటాల డిసైడ్ అయ్యారట. వచ్చిన డబ్బుతో ఆచార్య కొనుగోలుదారులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామంతో “ఆచార్య” దెబ్బకి కొరటాల శివ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క.. సినిమాకి వచ్చిన నష్టం మేరకు చిరంజీవి పది కోట్లు వెనక్కి ఇచ్చినట్టు టాక్. ఏది ఏమైనా వరుస విజయాల మీద ఉన్న కొరటాల శివ “ఆచార్య” కోసం సంవత్సరం వెయిట్ చేయటంతో పాటు రెండు సంవత్సరాలు చిత్రీకరణ.., వచ్చిన నష్టం బట్టి కెరియర్ పరంగా మూడు సంవత్సరాలు లాస్. పైగా సంపాదించుకున్నది వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని తాజా వార్తపై జనాలు రియాక్ట్ అవుతున్నారు.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!