Koratala Siva: ‘ఎన్టీఆర్ 30’ తర్వాత కొరటాల ముగ్గురు స్టార్ హీరోలను లైన్లో పెట్టాడు. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఆ తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్.టి.ఆర్తో జనతా గ్యారేజ్ సినిమాలను తీసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా మెగా మల్టీస్టారర్ సినిమా ఆచార్య తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. ఎన్నో రూమర్స్, కాంట్రవర్సీల, ప్యాండ మిక్ పరిస్థితుల మధ్య అన్నీ ఒత్తిడినీ తట్టుకొని ఎట్టకేలకు ఆచార్య సినిమాను పూర్తి చేశాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆచార్య అవుట్పుట్ బాగా వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి, చరణ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాతో కొరటాల మరో భారీ హిట్ కొట్టబోతున్నాడని ఇప్పటికే మేకర్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, వచ్చిన సాంగ్స్ చూస్తేనే ఆచార్య ఏ రేంజ్ హిట్ సాధిస్తుందో అర్థమవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ ఈ నెల 29న. అత్యధిక థియేటర్స్లో ఆచార్య సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ళు ఈ సినిమా కోసం శ్రమించిన కొరటాల రిలీజ్ అయ్యాక కొంత విరామం తీసుకోకున్నారు. ఆ తర్వాత జూన్ నుంచి ఎన్టీఆర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రాబోతున్నారు.
Koratala Siva: ఈసారి హ్యాట్రిక్ సినిమా ప్లాన్..
అయితే, నిన్నా మొన్నటి వరకు ఎన్టీఆర్ 30 తర్వాత కొరటాల ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా దానికి ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమా తర్వాత ముగ్గురు స్టార్స్ మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్లను కొరటాల లైన్లో పెట్టారు. ఇప్పటికే వీరితో సినిమాలు చేసేందుకు కమిటయ్యారట. మహేశ్ బాబుతో ఇప్పటికే రెండు హిట్స్ వచ్చాయి. కాబట్టి ఈసారి హ్యాట్రిక్ సినిమాను ప్లాన్ చేస్తారు. అలాగే, చరణ్తో అల్లు అర్జున్తో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కాబట్టి వీరితో భారీ హిట్ తీయడానికి ప్లాన్ చేసుకుంటాడు. అయితే, ఎవరితో కొరటాల సినిమా మొదలవనుందనే విషయంలో క్లారిటీ మాత్రం త్వరలో వెల్లడికానుంది.